ఇండస్ట్రీలోకి మరో వారసురాలి ఎంట్రీ..అనౌన్స్ చేసిన మంచు లక్ష్మీ ప్రసన్న

-

తెలుగు చిత్ర సీమలోకి ఇప్పటికే చాలా మంది తారల వారసులు సినీ ఎంట్రీ ఇచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది హీరోలు తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుని ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర తారల తనయులూ వస్తున్నారు. అయితే, సినీ ఇండస్ట్రీలోకి హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తనయులు మాత్రమే కాదు కూతుర్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా మరో వారసురాలి ఇండస్ట్రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది.

బోలెడు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సురేఖ వాణి గురించి అందరికీ తెలుసు. ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో ఉన్న వారందరికీ దాదాపుగా తెలుసు. ఈమె తన తల్లితో కలిసి సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె సినీ ఎంట్రీ గురించి చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కాగా, ఆ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు మంచు లక్ష్మీ.

కార్తీక్-అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది సురేఖ వాణి కూతురు సుప్రీత. ఈ పిక్చర్ లో లీడ్ రోల్ మంచు లక్ష్మీ ప్లే చేస్తోంది. శుక్రవారం ఈ సినిమా పోస్టర్‌ని ఇన్ స్టా గ్రామ్ వేదికగా మంచు లక్ష్మీ రిలీజ్ చేసింది. ఈ పిక్చర్ లో సుప్రీత, హరితేజ, హేమ, శ్రద్దాదాస్‌ కీలక పాత్రల్లో నటించనున్నట్లు మంచు లక్ష్మి తెలిపింది.

https://www.instagram.com/p/CdNpw6vrNpF/?utm_source=ig_embed&ig_rid=c6552a89-050a-4b0c-954d-9f25521bd353

Read more RELATED
Recommended to you

Latest news