Supriya Sule: ‘అన్న నువ్వు సిటిజెన్వి’: అజిత్ కి కౌంటర్ ఇచ్చిన సుప్రియ

-

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కొంతమంది 80 ఏళ్ల వయసులోనూ పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా లేరంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పరోక్ష విమర్శలు చేసిన వ్యాఖ్యలపై సుప్రియా సూలే ఘాటుగా బదులిచ్చారు. ‘మా సోదరుడు సీనియర్ సిటిజెన్ అని ఆయన వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు అని గట్టి కౌంటర్ ను ఇచ్చింది.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు 58 సంవత్సరాల వయసులో పదవి నుండి రిటైర్ అవుతారు. చాలా మంది 75 సంవత్సరాలు నిండిన తర్వాత వృత్తిపరమైన జీవితం నుంచి వైదొలుగుతారు. కానీ,కొంతమంది 84 ఏళ్లు వచ్చిన కూడా పదవీ విరమణ చేసేందుకు సిద్ధంగా లేరు’ అని ఠాణెలో నిర్వహించిన పార్టీ సమావేశం అజిత్ పవార్ అన్నారు.బీజేపీ నేతలు 75 సంవత్సరాలకు పదవీవిరమణ చేస్తున్నారు. ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ వంటి నాయకులు కొత్తతరం ఎదిగేందుకు అవకాశం కల్పించారు. మీకిప్పుడు 80 సంవత్సరాలు దాటాయి. ఇంకా ఎప్పుడు మీ ప్రయాణాన్ని ఆపుతారు..? మీరు మాకు ఆశీస్సులు ఇవ్వండి’ అంటూ పార్టీ బాధ్యతలు తనకు అప్పగించాలని అజిత్ పవార్ పరోక్షంగా అభ్యర్థించారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వయసు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారని తన అన్నకు సుప్రియ దీటుగా బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version