జింబాబ్వేతో T20 సిరీస్.. కెప్టెన్ గా శుభ్మాన్ గిల్

-

జులై 6 నుంచి జింబాబ్వేలో ప్రారంభమయ్యే T20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్గా జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్(వికెట్ కీపర్ ), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్ ), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్,రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్,తుషార్ దేశ్పాండేలను ఎంపిక చేసింది.

8 సంవత్సరాల తర్వాత జింబాబ్వేలో టీమిండియా పర్యటించడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2016లో సిరీస్ ఆడగా ఇండియా 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఇప్పటివరకు మూడు సార్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన మన క్రికెట్ జట్టు.. రెండు సార్లు సిరీస్ గెలువగా ,2015 లో జరిగిన సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది.

 

జింబాబ్వే-భారత్ T20 సిరీస్ షెడ్యూల్

* జులై 6- తొలి T20- హరారే

* జులై 7- రెండో T20-హరారే

* జులై 10- మూడో T20-హరారే

* జులై 13- 4వ T20-హరారే

* జులై 14- 5వ T20-హరారే

అన్ని మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version