టీమిండియా‌కు గట్టి షాక్.. వీసా సమస్యలతో ఆ ఇద్దరు పేసర్లు దూరం!

-

T20 World Cup 2022 : టి20 ప్రపంచ కప్ ముందు టీమిండియా కు మరో షాక్‌ తగిలింది. గాయాలతో స్టార్ పెసర్లు జస్ట్ ప్రీత్ బుమ్రా, దీపక్ చాహార్ మెగా టోర్నీకి దూరం కాగా, మహమ్మద్ షమీ రాణించడం పై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా నెట్ బౌలర్లుగా ఎంపికైన కశ్మీర్ సంచలనం ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ కూడా జట్టుకు దూరమయ్యారు.

పేస్ అనుకూలించే ఆసీస్ వికెట్లపై ఫాస్టెస్ట్ బౌలర్లతో భారత బ్యాటర్లను సిద్ధం చేయాలనుకున్న టీం మేనేజ్మెంటుకు అది లోనే గట్టి షాక్ తగిలింది. వీసా సమస్యలతో ఈ ఇద్దరు బౌలర్లు ఆస్ట్రేలియా ఫ్లైట్ మిస్సయ్యారు. అయితే వారు మళ్లీ వెళ్తారా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే ముకేశ్ చౌదరి, చేతన్ సకారియా నెట్ బౌలర్లుగా భారత జట్టుకు సేవలు అందిస్తున్నారు. దీపక్ చాహార్ జట్టు నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ వెల్లడించింది అతనికి రీప్లేస్ గా మరో స్పీడ్ స్టర్ శార్దూల్ ఠాకూర్ ను ఎంపిక చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news