ఇలా పగ్గాలు.. అలా వరాలు.. స్పీడ్ పెంచిన స్టాలిన్

-

తమిళనాడు: సాధారణలో ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పాలనపై స్పీడ్ పెంచారు. రాష్ట్ర ప్రజలపై వరాలు కురిపించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.4 వేలు సాయం ప్రకటించారు. కోవిడ్ సాయంగా తొలి విడతలో రూ.2 వేలు జమ చేస్తామని చెప్పారు. పాలపై రూ.3 తగ్గించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. దీంతో కరోనా వేళ స్టాలిన్ ప్రకటన రాష్ట్ర ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఇక కరోనా పరిస్థితులపై స్టాలిన్ ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.

ఇక తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత స్టాలిన్‌ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్‌తో గవర్నర్‌ భన్వరీలాల్‌ ప్రమాణం చేయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథులను మాత్రమే ఆహ్వానించారు. స్టాలిన్‌ తోపాటు 34 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దురైమురుగన్, కెఎన్‌. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్‌ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్‌ బాలాజీ, ఆర్‌. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్‌ఎస్‌ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్‌ త్యాగరాజన్, ఎస్‌ఎం. నాజర్, సెంజి కేఎస్‌ మస్తాన్, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, ఎస్‌వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్‌విళి సెల్వరాజ్‌‌కు స్టాలిన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వారసత్వ రాజకీయాల్లో స్టాలిన్ తమిళనాడులో రికార్డు సృష్టించారు. స్థాలిన్ కరుణానిధి కుమారుడు. ఇప్పటివరకూ తమిళనాడులో వారసులెవరూ సీఎం అయిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిగా తొలిసారి స్టాలిన్ వారసత్వ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు.

మొత్తం 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమికి 156 సీట్లు వచ్చాయి. అన్నాడీఎంకే కూటమికి కూటమికి 78 సీట్లు లభించాయి. దీంతో రాష్ట్రంలో దశాద్దకాలం తర్వాత డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైంది.

Read more RELATED
Recommended to you

Latest news