బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో తారకరత్న కీలకపాత్ర.. కానీ అంతలోనే..!

-

నందమూరి తారకరత్న మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దాదాపు 23 రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతూ చివరకు శనివారం రాత్రి కన్నుమూశాడు. తారక్ మరణం టాలీవుడ్​లోనూ తీవ్ర విషాదం నింపింది. సినీ ప్రముఖులు తారక్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

తారకరత్న మరణంతో ఆయన చివరి సినిమా ఏంటి.. లేటెస్ట్​గా వస్తున్న ప్రాజెక్టులేంటి అనే దానిపై అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలకపాత్ర కోసం తారకరత్నను చిత్రబృందం ఫిక్స్‌ చేశారట. ఈ సినిమాతో తారకరత్న దశ తిరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తారకరత్న 20ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. హీరో కంటే విలన్​గానే తారక్ ఎక్కువ గుర్తింపు పొందాడు.

Read more RELATED
Recommended to you

Latest news