కొడాలి నానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన జవహర్‌

-

ఇటీవల ఏపీలో విద్యాశాఖ విడుదల చేసిన పదోతరగతి ఫలితాలపై రాజకీయ దుమారం లేస్తున్న తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు పదో తరగతి విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లోకి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంటర్ కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఐడీల పేర్లతో వీరు జూమ్ మీటింగ్ లోకి ప్రవేశించారు. ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ స్పందిస్తూ… కొడాలి నాని కూర్చోవాల్సింది జూమ్ మీటింగ్ లో కాదని, పదో తరగతి పరీక్షల్లో అని అన్నారు. వేలిముద్రగాళ్లు రాజకీయాల్లో ఉంటే ఇలాగే జరుగుతుందని ఎద్దేవా చేశారు.

Costly liquor destroys poor families in State: TDP leader KS Jawahar

సీఎంతో పాటు ఆయన సహచరులందరికీ చదువంటే చాలా చులకన భావం ఉందని చెప్పారు. తమ నేత లోకేశ్ విద్యార్థుల కోసం యజ్ఞం చేస్తుంటే… వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని అన్నారు. ఏపీలో చదువులు ఎటు పోతున్నాయో అర్థంకాని పరిస్థితి ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news