విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత జవహర్‌ సెటైర్లు

-

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వీలైనప్పుడల్లా ఒకరిపై ఒకరు ఇరు పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే తాజాగా.. ఫోన్ పోయిందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాటకాలు ఆడుతున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సమాచారమంతా ఆ ఫోన్ లో ఉందని… అందుకే ఫోన్ పోయిందని డ్రామా చేస్తున్నారని అన్నారు జవహర్.

Vijay Sai Reddy Is 420 Tataiah: KS Jawahar

ఈడీ విచారణలో ఈ ఫోన్ ను పరిశీలిస్తే మొత్తం సమాచారం బయటపడుతుందని… అందుకే దాన్ని దాచేశారని జవహర్ చెప్పారు. అలాగే విశాఖ రుషికొండ వాటాల సమాచారం కూడా అందులో ఉందని అన్నారు జవహర్. తన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత తన ఫోన్ పోయిందని విజయసాయి అంటున్నారని దుయ్యబట్టారు జవహర్. విజయసాయి ఫోన్ నిజంగా పోయిందా? లేక జగన్ లాక్కున్నారా? అని ప్రశ్నించారు. మరోవైపు, విజయసాయికి చెందిన ఐఫోన్ 12ప్రో ఫోన్ పోయిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు జవహర్.

Read more RELATED
Recommended to you

Latest news