Breaking : బీఎల్ సంతోష్‌కు మళ్లీ నోటీసులు ఇవ్వండి.. సిట్‌కు సూచించిన హైకోర్టు

-

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజర్​పై హైకోర్టు విచారణ నిర్వహించింది. బీఎల్ సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని ఏజీ కోరారు. సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలని కోర్టు సిట్​ను ఆదేశించింది. సిట్‌ విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజరు​పై హైకోర్టు విచారణ చేపట్టింది. సంతోష్ సిట్ ముందు హాజరయ్యేలా ఆదేశించాలని ఏజీ కోర్టును కోరారు.

Telangana High Court closes PILs on high school fees, TS issues notices to  schools

ఈనెల 20న సంతోష్​కు నోటీసులు అందినా హాజరుకాలేదని తెలిపారు. సంతోష్ విచారణకు వచ్చేలా చూసే బాధ్యత పిటిషనర్‌పై ఉందని ధర్మాసనం పేర్కొంది. నిర్దిష్ట తేదీతో మరో 41ఏ సీఆర్​పీసీ నోటీసు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు. సంతోష్‌కు మరో నోటీసు జారీ చేయాలని కోర్టు సిట్​ను ఆదేశించింది. ఈ మెయిల్ ఐడీకి నోటీసులు జారీ చేయాలని తెలిపింది. అన్ని వివరాలతో ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను 30న చేపడతామని వెల్లడించింది హైకోర్టు.

 

Read more RELATED
Recommended to you

Latest news