HRC కి టీడీపీ పార్టీ లేఖ..పోలీసులపై చర్యలు తీసుకోవాలి !

-

చిలమత్తూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ హెచ్చార్సీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడి వేణుగోపాల్ పై ఎస్ఐ దాడి చేసిన వీడియోను ఎన్ హెచ్చార్సీకి పంపిన వర్ల… సత్యసాయి జిల్లా, చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో బాధితుడి వేణుగోపాల్ పై ఎస్.ఐ దాడి చేయడం కొంతమంది పోలీసుల దుర్మార్గపు చర్యలకు నిదర్శనమని… హిందూపురం అసెంబ్లీలోని సజీవరాయనపాలెంకు చెందిన బీసీ మహిళ పద్మావతి చాలా ఏళ్లుగా వికలాంగుల పింఛను పొందుతున్నారని ఆగ్రహించారు. ఆమె తమ పార్టీకి అనుకూలంగా లేదని వైసీపీ నాయకులు ఆమె పెన్షన్‌ను తొలగించారని.. పెన్షన్ తొలగించడాన్ని ప్రశ్నించిన ఆమె కుమారుడు వేణుగోపాల్ పై వైసీపీ నాయకుడు దామోదర్ రెడ్డి అతనిపై దాడి అక్రమ కేసు పెట్టారని ఆగ్రహించారు.

జరిగిన వాస్తవాలను లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లిన వేణుగోపాల్ పై చిలమత్తూరు ఎస్.ఐ రంగడు అసభ్యంగా దుర్భాషలాడుతూ దాడి చేశారని.. బాధితుడిని మరింత బాధించడం అత్యంత దుర్మార్గమని
ఎస్.ఐ తీరు రాజ్యాంగం ప్రసాధించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేని నిప్పులుచెరిగారు. ఇది ఏపీ పోలీస్ మాన్యూవల్‌కు కూడా పూర్తి విరుద్ధమని..నాగరిక ప్రజాస్వామ్య సమాజంలో ఎస్.ఐ రంగడు ప్రవర్తన ఆమోద యోగ్యం కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news