పట్టాభి…మరీ ఇంత గుడ్డిగాన…బాబు కొంపముంచేలా ఉన్నావుగా…

-

ఏపీలో ఏం జరిగిన అది జగనే చేశారని చెప్పడం టి‌డి‌పి నేతలకు బాగా అలవాటు అయిపోయింది. ఆఖరికి చిన్న పిల్లాడు అన్నం తినకపోయిన దానికి కారణం జగనే అనేలా టి‌డి‌పి నేతల వైఖరి ఉంది. ముఖ్యంగా టి‌డి‌పిలో నిత్యం మీడియా ముందు హల్చల్ చేసే అధికార ప్రతినిధి పట్టాభి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. రోజూ ఈయన పని ఒకటే మీడియాలో కనిపించడం….జగన్‌పై గుడ్డిగా విమర్శలు చేయడం. టీవీ డిబేట్లలో మరీ నోరేసుకుని పడిపోవడం చేస్తారు.

అసలు టి‌డి‌పిలో మాట్లాడేవాళ్లు ఎవరూ లేనట్లు ఎప్పుడూ పట్టాభినే హడావిడి చేస్తారు. తాజాగా కూడా పట్టాభి…జగన్‌పై డ్రగ్స్‌కు సంబంధించిన విమర్శలు చేశారు. చంద్రబాబు పెట్టుబడులు తెస్తే.. జగన్‌ డ్రగ్స్‌ తెస్తున్నారని మాట్లాడారు. అసలు చంద్రబాబు ఎంత గొప్పగా పెట్టుబడులు తెచ్చారో అందరికీ తెలుసు. కానీ డ్రగ్స్ విషయంలో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పట్టాభి జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్‌లో దొరికిన హెరాయిన్‌ని వదలకుండా దానిని జగన్‌కు ఆపాదించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ మాఫియా ఈ హెరాయిన్‌ను దిగుమతి చేసుకుందని పోలీసులు చెబుతున్నా ఈ పట్టాభి ఆగడం లేదు.

ప్రెస్ మీట్ పెట్టేసి జగన్‌పై ఆరోపణల పర్వం నడిపిస్తున్నారు. పైగా సి‌ఎం అనే గౌరవం లేకుండా ఏకవచనంతో సంబోధిస్తూ, పనికిరాని విమర్శలు చేస్తున్నారు. అయితే పట్టాభి…ఏదో విమర్శలు చేసి జగన్‌ని ఇబ్బంది పెట్టేస్తున్న అనుకుంటున్నారు గానీ, అవి పనికిమాలిన విమర్శలని జనాలకు అర్ధమవుతుంది.

ఇలా గుడ్డిగా విమర్శలు చేయడం వల్ల జనాలకే పట్టాభి ప్రెస్ మీట్లు చూడాలంటే చిరాకు వచ్చేలా ఉంది. పైగా పట్టాభి…జగన్‌పై బురదజల్లడం పక్కనబెడితే….అనవసరంగా మాట్లాడి చంద్రబాబు కొంపముంచుతున్నట్లు కనిపిస్తోంది. ఎడాపెడా ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల పట్టాభి…టి‌డి‌పికి పావలా ఉపయోగం తీసుకురావడంలో రివర్స్‌లో ఇంకా నెగిటివ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news