టిడిపిలో చేరాలంటే చంద్రబాబు, లోకేష్ కాళ్లు పట్టుకోవాలి – భూమా

-

టిడిపి యువ నేత భూమా విఖ్యాత రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. శిల్పా ఫ్యామిలీ టిడిపిలో చేరాలంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ కాళ్లు పట్టుకోవాలన్నారు భూమా విఖ్యాత రెడ్డి. గతంలో వారిపై చేసిన విమర్శలపై క్షమాపణ కోరాలి….అక్రమ కేసులు పెట్టి వేధించిన కార్యకర్తలు కూడా శిల్పా ఫ్యామిలీ క్షమాపణ కోరాలని తెలిపారు భూమా విఖ్యాత రెడ్డి.

నంద్యాల టికెట్ రేసులో నేను ఉన్నానని పేర్కొన్నారు భూమా విఖ్యాత రెడ్డి. సరైన వయస్సు లేదనేది గిట్టని వారు సృష్టించిన అపోహ..ఎన్నికలో పోటీకి నేను అర్హుడినేనని తెలిపారు. మా నాన్న భూమా నాగిరెడ్డి రాజకీయ జీవితాన్ని నంద్యాలలోనే ముగించారు, నేను ఇక్కడి నుండే ప్రారంభిస్తున్నాను.. పార్టీ నేతలు కార్యకర్తలు మూడు టీడీపీ ఆఫీసుల్లో ఎక్కడికైనా వెళ్లవచ్చు అని వివరించారు భూమా విఖ్యాత రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news