9 ఏళ్ళల్లో ఒక్క రోజు కూడా మోడీ సెలవు తీసుకోలేదు : కిషన్ రెడ్డి

-

9 ఏళ్ళల్లో ఒక్క రోజు కూడా మోడీ సెలవు తీసుకోలేదని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అతిపెద్ద రాజకీయ పార్టీ బిజెపి అని.. చైనా కమ్యునిస్టు పార్టీని వెనక్కి నెట్టేసి బిజెపి పెద్ద పార్టీ గా అవతరించిందన్నారు కిషన్ రెడ్డి. బంగారు తెలగాణ పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారు..దేశంలో తెలంగాణను నవ్వుల పాలు చేశారని నిప్పులు చెరిగారు.

దేశంలో కుటుంబ పార్టీ లకు నాయకత్వం వహిస్తాను.. ఖర్చు పెట్టుకుంటా అని కేసీఆర్ చెప్పడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 9 ఏళ్ళల్లో ఒక్క రోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదన్నారు. కేసీఆర్ సచివాలయానికి రారు.. పాలనను విస్మరించారు… కుట్రలు చేసి.. బీజేపీని అనిచివేయలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. TSPSC పేపర్ లీకేజీ తో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు.. ఆ విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారు… TSPSC లీకేజీ నీ ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ లో ప్రాజెక్ట్ ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోడీ వస్తున్నారని వివరించారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news