Breaking : తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరు !

-

ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ , రాజకీయ నాయకులు తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న పై నమోదు అయిన… అన్ని కేసుల్లోనూ… బెయిల్ మంజూరు అయినట్టు సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి కాసేపట్లోనే దీనిపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న
Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

నిజామాబాద్ జిల్లాలో కళ్ళు వ్యాపారి వద్ద మల్లన్న టీం డబ్బులు వసూలు చేస్తుందని, ప్రముఖ జ్యోతిష్యుడి నుంచి ఏకంగా 30 లక్షలు డిమాండ్ చేసినట్లు మల్లన్న పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్న  వ్యవహారంపై కూడా తీన్మార్ మల్లన్న పై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో తీన్మార్ మల్లన్న ఉన్నారు. అయితే పై కేసులు అన్నిటిలోనూ తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరు అయినట్లు సమాచారం అందుతోంది. కాగా ఇటీవలే తీన్మార్ మల్లన్న కుటుంబం.. అమిత్ షా ను కలిసిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news