Breaking : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

-

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. అయితే.. మొన్నటి వరకు భారీ నమోదైన కరోనా కేసులు.. తాజాగా తగ్గుముఖం పట్టాయి. అయితే తెలంగాణలో సైతం తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,031 కరోనా పరీక్షలు నిర్వహించగా, 605 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 231 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 42, రంగారెడ్డి జిల్లాలో 38, కరీంనగర్ జిల్లాలో 30 కేసులు గుర్తించారు.

The Corona Crisis: The Rothschilds? Bill Gates? The Search For A Scapegoat  Has Begun

అదే సమయంలో 992 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,27,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,18,552 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,720 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news