రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం స్పీకర్ వెన్న వరం భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో… అసెంబ్లీ కమిటీ హాల్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు.

అసెంబ్లీ ప్రాంగణంలో తీసుకోవలసిన భద్రతా చర్యలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు మరియు సభ్యులు సభా లోనికి వెళ్లేందుకు వేరువేరు ప్రవేశ ద్వారాలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే కరోనా నేపథ్యంలో… కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ అసెంబ్లీ సమావేశాలలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా దళిత బంధు పథకం అమలు, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు, 50 వేల ఉద్యోగాల నియామకం ఇలాంటి విషయాలపై సభ్యులు చర్చించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news