తెలంగాణ బిజెపిలో చాలామంది మున్నాభాయ్ MBBS లు ఉన్నట్లు కనిపిస్తోంది – కేటీఆర్

-

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు మంత్రి కేటీఆర్. ఈ ట్వీట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

” బిజెపిలో చాలామంది మున్నాభాయ్ MBBS లు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందులో తెలంగాణకు చెందిన ఇద్దరు బిజెపి ఎంపీలు ఫేక్ సర్టిఫికెట్ హోల్డర్లు.. రాజస్థాన్, టిఎన్ విశ్వవిద్యాలయాల నుండి నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారు. ఎన్నికల అఫీడవిట్ లో అబద్ధాలు చెప్పడం క్రిమినల్ నేరం కాదా? లోక్సభ స్పీకర్ దీనిని నిర్ధారించకూడదా? దోషులుగా తేలితే అనర్హత వేటు వేయొచ్చు కదా?” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ ట్వీట్ ని చూసిన నెటిజన్లు ఆ ఇద్దరూ ఎంపీలు ఎవరని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news