నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..నిరుద్యోగులకు గుడ్ న్యూస్..?

-

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలు పూర్తవుతుందన్న నేపథ్యంలో సమావేశాల తేదీల ఖరారు చేసే అవకాశం ఉంది. దళిత బంధు అమలు పై చర్చ..ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనసభ లో ప్రతి పక్షాల మాటలకు కౌంటర్ ఇవ్వడం పై మంత్రులకు కేసీఆర్ దిశ నిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కృష్ణ జలాల వివాదం పై కేంద్ర పెద్దలను కలిసిన సీఎం కేసీఆర్ అదే విషయంలో మంత్రులతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విద్యుత్ వివాదం పై కూడా సమావేశం లో చర్చించనున్నారు. ఉద్యోగల భర్తీ పై కేబినెట్ లో చర్చ జరిపి నోటిఫికేషన్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వినాయక నిమార్జనం పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ ఉన్న నేపథ్యంలో ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పై చర్చ జరిపే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు విషయంపై కూడా మరో సారి కేబినెట్ చర్చించనుంది. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల భర్తీ పై చర్చిస్తున్న నేపథ్యం లో నిరుద్యోగులకు ఈరోజు గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version