తెలంగాణ కరోనా విజృంభన..కొత్తగా 56 వేల పడకలు ఏర్పాటు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 56 వేల పడకలు ఏర్పాటు చేశామని.. కరోనా కేసులతో వస్తున్న రోగులకు సత్వర వైద్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేస్తూ… ఉచిత మెడికల్ కిట్ లను అందిస్తున్నామని ప్రకటన చేశారు.

ఎవరూ కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వం అందరికీ ఆరోగ్య భరోసా కల్పిస్తుతుందని వెల్లడించారు. కరోనా కల్లోలానికి ప్రజలు అధైర్య పడవద్దు, ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలి, అనుమానం ఉంటే హోమ్ ఐసోలేషన్ కిట్ వాడాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news