తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులోనే..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,879 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో ఏడుగురు మరణించారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,612కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 16,287 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 313 మంది మరణించారు. అలాగే 11,012 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news