BREAKING : వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం

-

BREAKING : వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్‌ సర్కార్‌ తరఫున దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములాడ రాజన్నకు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంత‌రం కుటుంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకున్నారు. దర్శనానంతరం వేద‌పండితులు ఆశీర్వచనాలను అందించారు. కాగా, నేడు మహాశివరాత్రి. ఈ నేపథ్యంలోనే శివనామ స్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా వేముల వాడ ఆలయ ప్రాంగణాలు, పరిసరాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news