ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రభుత్వ పిటిషన్​పై ఈనెల 17న సుప్రీంకోర్టు విచారణ

-

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనెల 17న ఆ కేసుపై విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. అయితే అప్పటివరకు దానిపై స్టేటస్‌ కో ఇవ్వాలని కోరగా.. ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ నిరాకరించారు.

మరోవైపు ఇటు హైకోర్టులోనూ తీర్పు ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సీజే అంగీకరించలేదు. కేసు దస్త్రాల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని, సింగిల్‌ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని సీజేను ఏజీ కోరారు. అయితే డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్‌ జడ్జి విచారణ జరపరాదని, సుప్రీంకోర్టు మాత్రమే సమీక్ష చేస్తుందని సీజే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news