బీజేపీకి షాక్.. సాలు దొర‌- సెలవు దొర ప్రచారంపై ఎన్నికల సంఘం సీరియస్

-

తెలంగాణ బీజేపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై ప్రచారాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఆదేశాలు జారీ చేసింది. సాలు దొర‌- సెలవు దొర ప్రచారంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

సీఎం బొమ్మతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలే ‘సాలు దొర-సెలవు దొర’ ప్రచారానికి అనుమతి కోరుతూ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు ఎలక్షన్​ కమిషన్​ను సంప్రదించారు. సాలు దొర- సెలవు దొరపై బీజేపీ విజ్ణప్తిని తోసిపుచ్చిన ఈసీ.. ప్రచారాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news