తెలంగాణ మంత్రి సోదరుడి వేధింపులు.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

-

హైదరాబాద్: ఓ మంత్రి, అతని సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ల నుంచి నుంచి తమకు ప్రాణహాని ఉందని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రిపై 2018 ఎన్నికల సమయంలో ఓ కేసు విషయంలో దంపతులు సాక్షిగా ఉన్నారు. దీంతో తమపై కక్ష కట్టి మంత్రి, అతని సోదరుడు అక్రమ కేసులు పెట్టి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక రూరల్ సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి ఇంటి‌పై దాడులు చేయిస్తూ భయబ్రాంతులకు గురి చేయిస్తున్నారని వాపోయారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న తమ ఇద్దరి ఉద్యోగాలను కూడా మంత్రి తీసివేయించి కుటుంబాన్ని వీధిన పడేశాని ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఇదే విధంగా వేధిస్తే మంత్రి, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పేర్లు రాసి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news