నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

-

సెప్టెంబర్ 17న హైదరాబాద్ ప్రాంతం భారత యూనియన్‌లో చేరిన సందర్భంగా ఇవాళ ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజధాని హైదరాబాద్‌లో ప్రధాన కార్యక్రమం జరగనుంది. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.

అనంతరం వేదికపై నుంచి సీఎం ప్రసంగిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ జెండా ఎగరవేసి గౌరవవందనం స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానికసంస్థల పరిధిలోని కార్యాలయాల్లోనూ జాతీయజెండా ఎగరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఇవాళ సాధారణ సెలపు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.

ఇప్పటికే జాతీయ సమైక్యతా ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news