Breaking News : మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు

-

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర  మల్లారెడ్డి పై తాజాగా మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే  ల్యాండ్ కబ్జాలపై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా మల్లారెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. పేట్ బషీరాబాద్ లో 32 గుంటల భూమి కబ్జా చేశారని.. శేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.

వీరిపై మొత్తం 7 సెక్షన్ల కింద మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరి పై కేసు నమోదు అయింది. ల్యాండ్ కబ్జా చేయడంతో పాటు  బెదిరింపులకు పాల్పడినట్టు కూడా ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు. ఆ ల్యాండ్ లో కొన్ని నిర్మాణాలు తొలగించారని.. అక్కడ ఉన్న కొంత మంది వ్యక్తులపై దాడి చేసినట్టు సమాచారం. శేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొత్తం 15 మంది పై కేసు నమోదు అయింది. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు కూల్చివేయించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version