BREAKING : తెలంగాణ మంత్రి ఇంట్లో అనుమానస్పదంగా మృతదేహం !

-

BREAKING : తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంట్లో కలకలం రేగింది. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంట్లో ఓ వ్యక్తి చనిపోవడం అందరినీ షాక్‌ కు గురి చేసింది. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.. సొంత నియోజక వర్గం బాల్కొండ లోని ఆయన సొంత గ్రామం వేల్పూర్‌ లోని ఆయన ఇంట్లో.. ఓ వ్యక్తి చనిపోయాడు.

అయితే.. ఆ వ్యక్తి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంట్లో పని చేశేవాడని సమాచారం అందుతోంది. దీంతో ఈ ఘటనకు ప్రాధాన్యత చేకూరింది. అయితే.. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా చంపారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news