హైదరాబాద్‌ లో మైనర్ బాలిక‌ మృతి.. క్షుద్ర పూజాలే కారణమట !

-

హైదరాబాద్‌ లోని కుల్సాంపురలో మైనర్ బాలిక‌ అనుమానాస్పద మృతి చెందింది. బాలిక నవ్య అనుమానాస్పదస్థితిలో చనిపోయింది. అయితే.. నవ్య మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ విషయంపై ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. నవ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఎంతో యాక్టివ్గా ఉండేదని తెలిపారు.

గత గురువారం అమావాస్య రోజు మా ఇంటి ముందు నిమ్మకాయలు, కొన్ని నల్ల బొమ్మతో ఉన్నవి పడేశారని.. అప్పటినుండి నవ్య పూర్తిగా డిస్టర్బ్ అయ్యిందని వెల్లడించారు కుటుంబ సభ్యులు. నిన్న ఉదయం కూడా మా అందరితో కలిసి మాట్లాడింది, ఆడుకుంది… కానీ రాత్రి ఇంట్లో గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. క్షుద్ర పూజల వల్లే మా నవ్య ఆత్మహత్య చేసుకుందని మేము అనుకుంటున్నామని.. నిమ్మకాయలు, నల్ల బొమ్మలు కనబడకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వివరించారు. కళ్ళు మూసినా తెరిచిన అవే కనబడుతున్నాయని నవ్య మాతో చెప్పేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news