నేటి నుంచే హైదరాబాద్‌లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు

-

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్. రేపటి నుంచి లాటరీ పద్ధతిలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఈ లెటర్ ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ లాటరీ షెడ్యుల్ ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ హెచ్ఎండిఏ వెబ్ సైట్ లో ఉంచామని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఫ్లాట్లో విక్రయానికి హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇవ్వగా… ఇవాల్టి నుంచి లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించనున్నారు. బండ్లగూడ లోని 2246 ఫ్లాట్లు కొనుగోలు కోసం 33121 దరఖాస్తులు వచ్చాయి. పోచారం లోని 1470 ప్లాట్ల కోసం 5921 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బండ్లగూడ లోని 345 త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్ల కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇవాళ్టి లాటర్‌ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news