తెలంగాణ ప్రజలకు అలర్ట్… నేటి నుంచి ఆషాఢ బోనాలు

-

తెలంగాణలో ఆషాడ బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ బోనాలతో షురూ అవుతాయి.

ఇవాళ లంగర్ హౌస్ లో నిర్వహించే గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు ఇంద్రకరణ్, ముహమద్ అలీ, తలసాని పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వ రూ. 15 కోట్లు కేటాయించింది.

కాగా, నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది తెలంగాణ అమరుల స్మారకం. ఇవాళ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా మ. 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి నెక్లెస్‌ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్‌ మధ్య ట్రాఫిక్‌కు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news