BREAKING : తెలంగాణ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బండి సంజయ్ పిర్యాదు

-

జాతీయ మానవ హక్కుల కమిషన్ కు బండి సంజయ్ పిర్యాదు చేశారు. రాష్ట్రంలో రేషన్‌కార్డులను రద్దు చేయడం, కొత్తరేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసిన బండి సంజయ్‌ కుమార్‌… రద్దు చేసిన 19 లక్షల రేషన్‌కార్డులపై, కొత్తరేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిబంధనలపై దర్యాప్తు జరపాలని జాతీయ మానవహక్కుల కమీషన్‌ను కోరారు.

అర్హులైన పేదలకు కొత్తరేషన్‌కార్డులను మంజూరు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సిని కోరిన బండి సంజయ్‌… కొత్త రేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిషేదాన్ని వెంటనే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సిని కోరారు.

రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 19 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్న బండి సంజయ్‌….కొత్తరేషన్‌కార్డుల కు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. జూన్‌ 2021 నుంచి కొత్తరేషన్‌కార్డుల దరఖాస్తులను, మీ సేవ సెంటర్లు ఆమోదించడం లేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news