BREAKING : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ !

-

అర్థరాత్రి నల్గొండ హైవే పై హైడ్రామా చోటు చేసుకుంది. మునుగోడుకు వెళ్లేందుకు ప్రయత్నించిన బండి సంజయ్ ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బీజేపీ నేతలు. దీంతో నడి రోడ్డు పై ధర్నాకు కూర్చున్నారు బండి సంజయ్. ఈ నేపథ్యంలోనే.. బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు…అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ప్రస్తుతం అబ్దుల్లాపుర్ మెట్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో పోలీస్ స్టేషన్ బయట భారీగా బీజేపీ కార్యకర్తలు గుమిగూడారు. మునుగోడు లో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి అన్నది మా ఉద్దేశమని.. కెసిఆర్ గుండాలు అక్కడ ఇంకా ఎందుకు ఉన్నారని ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యే లు మునుగోడు లో మకాం వేశారని… వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మేము మునుగోడు ఖచ్చితంగా వెళ్లి తీరుతామని హెచ్చరించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news