మోడీ తెలంగాణకు వస్తున్నాడు.. కెసిఆర్ కు కరోనా రావడం ఖాయం – బండి సంజయ్

-

మోడీ తెలంగాణకు వస్తున్నాడు.. కెసిఆర్ కు కరోనా రావడం ఖాయం అని చురకలు అంటించారు బండి సంజయ్. పరేడ్ గ్రౌండ్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. జులై 3న పరేడ్ గ్రౌండ్లో మోడీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసాం…రాష్ట్రంలో చరిత్ర సృష్టించేలా మోడీ సభ నిర్వహిస్తామన్నారు. కార్యకర్తలు, నాయకులు సభ కోసం ఉత్సాహంగా ఉన్నారు…10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో, హైదరాబాద్ లో బీజేపీ జెండా రెపరేప లాడిస్తాం..ఎక్కువ సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం…సామాన్యులు రోడ్డు మీద నడవలేని పరిస్థితని పేర్కొన్నారు.

రాష్ట్ర పరిస్థితి అదోగతిలో ఉంది…అరాచక పాలనకు చరమగీతం పాడుదాం…ప్రజా సమస్యలపై అన్నింట్లో స్పందిస్తున్నామని వెల్లడించారు. ప్రగతి భవన్ లో ఒక గది, ఒక సెక్షన్ ఏర్పాటు చేశారు. అయినా మమ్మల్ని ఏమి చేయలేక పోతున్నారు.ప్రజాస్వామ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నాము.సర్వేల్లో టిఆర్ఎస్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news