BREAKING : నేడు బండి సంజయ్ బర్త్ డే..కేసీఆర్ వ్యతిరేకంగా “మౌన దీక్ష”

-

ఇవాళ కరీంనగర్ లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ లోని లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మౌన దీక్ష పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్ లో ఇవాళ ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు తలపెట్టిన ఈ మౌనదీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొంటారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తమ తమ ప్రాంతాల్లో మౌన దీక్షకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.

అలాగే మరోవైపు ఈ నెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి పార్టీ బైక్ ర్యాలీలు చేపట్టనుంది. ప్రజల/ పల్లె ఘోష భరోసా పేరుతో ఈ బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఏ నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరో అక్కడ చేరికలపై దృష్టి పెట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా.. ఇవాళ బండి సంజయ్‌ బర్త్‌ డే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news