పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం: బండి సంజయ్ సంచలన ప్రకటన

-

తుక్కగూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన ప్రకటన చేశాడు. బీజేపీ గెలిస్తే.. రాష్ట్రంలో వ్యాట్‌ సవరించి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గిస్తామని.. వెల్లడించారు బండి సంజయ్‌. నిరుద్యోగులకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు.

పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా కొరిగిందన్నట్లు… కేసీఆర్ కు అధికారం కట్టబడితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేసీఆర్ ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి శ్రీలంకకు పట్టిన గతే పడుతుందన్నారు.

రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్న సంజయ్… కేబినెట్ లోని ప్రధాన పోస్టులన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయన్నారు. డ్రగ్స్ మాఫియా, భూ మాఫియా, ఇసుక మాఫియా… ఇలా ప్రతి రంగంలో రాష్ట్రాన్ని మాఫియాకు అడ్డగా మార్చారని ఆరోపించారు. నిజాం రాజులు, ఔరంగజేబ్ వారసులకు మోకరిల్లే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక ఎంత మాత్రం పాలించే హక్కు లేదన్నారు   బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Latest news