బండి సంజయ్ – రేవంత్ రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం జరిగింది – గంగుల కమలాకర్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ – కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు మంత్రి గంగుల కమలాకర్. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనని అన్నారు. పాదయాత్రలు చేస్తూ వస్తున్న నేతల మాయ మాటలకు మోసపోతే మళ్ళీ గోసపడతామని అన్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు గంగుల కమలాకర్.

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ” హాత్ సే హాత్ జోడో” యాత్రను ఒక ఫ్లాప్ షో గా అభివర్ణించారు. యాత్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రచారం కోసమే కెసిఆర్, కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రజలు ఆదరించకపోవడంతోనే బిఆర్ఎస్ నాయకుల పై అడుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news