ఖమ్మం సాయి గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్

-

ఖమ్మం లో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. సాయి గణేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు బండి సంజయ్. ఆయన వెంట పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మ బోరున విలపించింది.

పోలీసుల వేధింపులకు తన మనవడు బలయ్యారని సావిత్రమ్మ కంటతడి పెట్టారు. సాయి గణేష్ కు బిజెపి అంటే ప్రాణమని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారని వివరించారు. సాయి గణేష్ పై 16 కేసులు పెట్టారని, రౌడీ షీట్ పెట్టారని సావిత్రమ్మ వాపోయింది. మంత్రి, పోలీసులు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని సావిత్రమ్మ కన్నీటి పర్యంతమైంది. సావిత్రమ్మ కుటుంబాన్ని బండి సంజయ్ ఓదార్చారు. సావిత్రమ్మ కు ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news