ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు – జీవన్ రెడ్డి

-

కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ అఖిలభారత కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడుతున్న ప్రతిపక్షాలను కేంద్రం అణగదొక్కడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆరోపించారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news