నేడు నిర్మల్ జిల్లా బంద్ కు బిజెపి పిలుపు

-

BREAKING : నేడు నిర్మల్ నియోజక వర్గ బంద్ కు బిజేపి పార్టీ పిలుపునిచ్చింది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ నియోజక వర్గ బంద్ కు పిలుపు ఇచ్చింది బీజేపీ పార్టీ. మాస్టర్ ప్లాన్ బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా తయారు చేసారని బిజేపి పార్టీ ఆరోపణలు చేస్తోంది.

దీంతో మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతూ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నారు బిజేపి నేత మహేశ్వర్ రెడ్డి. ఈ తరుణంలోనే… నేడు నిర్మల్ నియోజక వర్గ బంద్ కు బిజేపి పార్టీ పిలుపునిచ్చింది. ఇక అటు నేడు నిర్మల్ జిల్లా కేంద్రానికి బిజేపి నేత రఘునందన్ రావు రానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష కు సంఘీభావం తెలపనున్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version