బిజెపి దేశాన్ని సర్వనాశనం చేస్తోంది – మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

నిజమాబాద్ లోని బాల్కొండ M.K ఫంక్షన్ హాల్లో బాల్కొండ మండల బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూటా మాటల బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేస్తోందని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన అర్వింద్ కు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నరని అన్నారు.

కేసిఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి,ఎస్బిఐ లో ప్రజల డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ…సంబంధం లేని కేసులో కవితమ్మను విచారణ చేస్తున్నరని మండిపడ్డారు. రైతులు, పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసిఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రశాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news