ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరిచిన బిజెపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్

-

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహనీయుల విగ్రహాలు శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ లిబర్టీ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరిచారు బిజెపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు.

స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది మహనీయులు నేలకొరిగారని.. అనేక మంది స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే ఈ స్వాతంత్ర భారతమని అన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి, యువత స్ఫూర్తి పొందాలన్నారు. స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news