బిజెపి మాటలు తియ్యగా ఉన్నాయి.. చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి: హరీష్ రావు

-

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బిజెపి మాటలు తియ్యగా.. చేతలు మాత్రం చేదుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని చెప్పారు.

బీజేపీ నేతలు బండి సంజయ్, డి.కె.అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. దాడుల వెనుక టిఆర్ఎస్ హస్తం ఉంటే.. ఉత్తరప్రదేశ్ లో ఎవరి హస్తం ఉన్నట్లు అని అన్నారు. అగ్నిపథ్ ను మార్చాలి అని అడిగితే యువకులను కాల్చి చంపుతున్నారు అని అన్నారు. అగ్నిపధ్ యువకులకు అర్థం కాలేదు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యువకుల బాధ బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు అన్నారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news