ధరణితో BRS నాయకులే బాగుపడ్డారు – బండి సంజయ్

-

తెలంగాణ సర్కార్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణితో బిఆర్ఎస్ నాయకులే బాగుపడ్డారని ఆరోపించారు. పోడు భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని ఆరోపించారు. కోకాపేటలో వేలకోట్ల విలువ చేసే భూములపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ కి పోటీగా బిఆర్ఎస్ కోకాపేట భూములను లూటీ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రికి ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని.. ఎన్నికల తర్వాత భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. కోకాపేటలో వేలకోట్ల విలువ చేసే భూములను ఒక సంస్థ పేరుతో బిఆర్ఎస్ నేతలు కాజేస్తున్నారని ఆరోపించారు. భూ ఆక్రమణలను, అక్రమార్కులను బిజెపి వదిలిపెట్టదని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బిఆర్ఎస్ రాక్షసానందం పొందుతుందని.. తెలంగాణలో రేపు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కలవబోతున్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news