తెలంగాణలో పార్టీ బలం పెంచడంపై చంద్రబాబు ఫోకస్..!

-

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశం అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. అందరినీ చూడడానికి ఇక్కడికి వచ్చాను. ముఖ్య మంత్రి అయ్యాక ఒక్క సారే వచ్చాను. మరో సారి ఇక్కడ అందరినీ కలిసి రెండు గంటలు గడుపుదామని వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ వచ్చిన తరువాత నాకు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ తీసుకున్నాను. ఇక్కడ పార్టీ నీ మరోసారి బలోపేతం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ పార్టీలో పని చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వారందరి కోసం పార్టీ బలపర్చాలని అనుకుంటున్నాము. పార్టీ ఎలా బలపర్చాలనేది ఆలోచన చేస్తున్నాము.

కొన్ని ప్రత్యేకమైన పరిస్థితిలో ఇక్కడ అధ్యక్షున్ని పెట్టలేదు. ఇక్కడ గత రెండు ఎన్నికలకి దూరంగా ఉన్నాము. పార్టీ ని ఎలా బలోపేతం చేయాలని, ప్రజలకు ఎలా సేవలు అందించాలి అనేది ఆలోచిస్తునాం. తెలుగు ప్రజల కోసం నిరంతరం పని చేసిన పార్టీ టీడీపీ. కాబట్టి తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. తెలుగు ప్రజల మనోభావాల కోసం పని చేస్తాము అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news