తెలంగాణా వెలుగుతుంటే… ఏపీ చిమ్మచీకటిలో ఉంది – సీఎం కేసీఆర్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు తెలంగాణ వస్తే చిమ్మచీకటి అయిపోతది అని శాపాలు పెట్టారు. ఈ రోజు తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో వెలిగిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం చిమ్మచీకటి అయిపోయిందన్నారు సీఎం కేసీఆర్.

నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ఒకప్పుడు పాలమూరు ప్రజలు ముంబయి బస్సులను పట్టుకొని వలస పోయేవారని, ఇప్పుడు పరిస్థితి మారిపోయి అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని సీఎం సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news