తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు..త్వరలోనే 2వ పీఆర్సీ !

-

తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు చెప్పారు. త్వరలోనే 2వ పీఆర్సీ ప్రకటించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో 2 వ పీఆర్సీ వేయనున్నారు సీఎం కేసీఆర్‌.

అలాగే, ఇంటెరిం రిలీఫ్ కూడా ప్రకటించనుంది కేసీఆర్‌ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం పై కూడా నిర్ణయం తీసుకోనుంది. ఈహెచ్ఎస్ అమలుకు విధి విధానాలు తయారు చేయనుంది కేసీఆర్‌ సర్కార్‌.గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌజింగ్ పై కూడా కేసీఆర్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారట. ఆ తర్వాత పై అంశాలపై చర్చించనున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news