తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పని అయిపోయింది: మంత్రి మల్లారెడ్డి

-

తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పని అయిపోయిందన్నారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. ఈడీ నోటీసులు వస్తే ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలి కానీ.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని ఎద్దేవా చేశారు. డ్యూటీలో ఉన్న ఎస్ఐ కాలర్ ఎలా పట్టుకుంటారు అని ప్రశ్నించారు మల్లారెడ్డి. శాంతి భద్రతల పరిరక్షణకు ఇబ్బంది కలిగిస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు.

బిఆర్ఎస్ పై మా నాయకుడికి పూర్తిస్థాయి స్పష్టత ఉందని తెలియజేశారు. దేశంలో కాంగ్రెస్ రెండే రాష్ట్రాల్లో అధికారంలో ఉందని.. బీజేపీ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతుంది అన్నారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు ఇద్దరు ఐరన్ లెగ్ లని అభివర్ణించారు. వాళ్ళిద్దరూ ఎక్కడ అడుగుపెడితే అక్కడ వర్షాలు ఉండవని అన్నారు.కాంగ్రెస్ దేశంలో గుండు సున్నా అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news