తెలంగాణలో మరో పరువు హత్య..ప్రియురాలి ఫోన్‌ చేసి మరీ !

-

తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న అదృశ్యమైన సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు BDL భానూర్ కి చెందిన శివకుమార్ అనే యువకుడు హైదరాబాద్ లో హత్యకు గురయ్యాడు. శివకుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా కోడెరు గ్రామం కాగా, ప్రేమ వ్యవహారంమే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

BDL భానురు పోలీస్ స్టేషన్ లో ఈ నెల 7న శివకుమార్ (18)పై మిస్సింగ్ కేసు నమోదు అయింది. అయితే.. హైదరాబాద్ లోని ముషీరాబాద్ పరిసర ప్రాంతంలో చంపేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. చంపి బొల్లారంలో పడవేసినట్టు ఇద్దరు నిందితులు ఒప్పుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఉన్నారు. శివకుమార్ ప్రియురాలే ఫోన్ చేసి హైదరాబాద్ పిలిచిందని చెబుతున్నారు బంధువులు. ఇక ఈ కేసును ముషీరాబాద్ పొలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు BDL భానూర్ పోలీసులు. ఇది పరవు హత్య అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news