రాష్ట్రంలో డెంజ‌ర్ బెల్స్.. కొత్తగా 2,319 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ డెంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ రాష్ట్రంలో 2,319 కేసులు వెలుగు చూశాయి. కాగ నిన్న‌టితో పోలిస్తే రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగానే పెరిగాయి. రాష్ట్రంలో క‌రోనా కేసులు నిన్న‌టితో పోలిస్తే.. దాదాపు 400 క‌రోనా కేసులు పెరిగాయి.

కాగ రాష్ట్రంలో ఈ రోజు 2,319 క‌రోనా కేసులు వెలుగు చూశాయని.. అలాగే క‌రోనా కాటుకు ఇద్ద‌రు మృతి చెందార‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. కాగ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 474 మంది బాధితులు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 18,339 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్రంలో 90 వేల 21 మందికి కరోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news