రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము తెలంగాణ పర్యటన వాయిదా

-

బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరు మేధావులతో ఇవాళ ఆమె సమావేశం కావాల్సి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది తెలంగాణ పర్యటన వాయిదా పడింది.

కాగా రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు, ఈ రోజు మరియు రేపు అతిభారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. నిన్న దక్షిణ ఒరిస్సా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు ఒడిస్సా తీరము లోని వాయువ్య బంగాళాఖతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. ఈ అల్పపీడనం రాగల 48 గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news